Telangana

సృజనాత్మకతతోనే వాస్తుశిల్పులుగా రాణించగలరు

సెయింట్ ఆంథోని విద్యార్థులకు గీతం ఆర్కిటెక్చర్ అధ్యాపకుల ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సృజనాత్మకతతోనే వాస్తుశిల్పులుగా రాణించగలరని, విభిన్న యోచనే ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను ఆధిరోహించడానికి దోహదపడుతుందని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్యాపకులు అభిప్రాయపడ్డారు. సెయింట్ ఆంథోనీ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం గీతంను సందర్శించారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఛార్జి డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని అధ్యాపక బృందం అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్నిగ్రా రాయ్, అభిషేక్ సింగ్ వారితో సమావేశమై, సృజనాత్మక ప్రాజెక్టుల యొక్క సమగ్ర అవలోకాన్ని ఆ విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలను అందించి, నిర్మాణ విద్యలో గీతం వినూత్న విధానాలను ఆవిష్కరించారు. ఆ తరువాత, అంథోని విద్యార్థులు ఎగ్జిబిషన్ హాల్, మెటీరియల్ మ్యూజియంలను సందర్శించారు. చివరగా సెమినార్ హాలులో వారికి ఆర్కిటెక్చర్ విద్యపై మరింత అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం విద్య, సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించడంలో గీతం నిబద్ధతను తెలియజేయడమే గాక, భవిష్యత్తులో ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసించాలని అనుకునేవారిని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మిశ్రా వివరించారు. తాము ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని విశ్వసిస్తామని, వారి ప్రతిభ, ఆకాంక్షలను పెంపొందించే వాతావరణాన్ని అందించడానికి అంకితభావంతో కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.అర్కిటెక్చర్ విద్యలో అగ్రగామిగా గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పాత్రను, రేపటి వాస్తుశిల్పులను రూపొందించడంలో దాని అంకితభావాన్ని ఈ కార్యక్రమం నొక్కిచెప్పింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago