politics

గ్రాన్యూల్స్ సీఎండీకి గీతం గౌరవ డాక్టరేట్… గీతం స్నాతకోత్సవంలో ప్రదానం

పటాన్ చెరు:

గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఈనెల 28 న ( రవారం ) నిర్వహించనున్న 12 వ స్నాతకోత్సవంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నారు . ఈ విషయాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శవరావ ఎకృష్ణ అధ్యక్షత జరిగే ఈ స్నారకోత్సవంలో దాదాపు 1300 మంది విద్యార్థులకు పబ్బాలను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు .

కృష్ణ ప్రసాద్ గురించి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పారిశ్రామిక అనుభవం ఉన్న కృష్ణ ప్రసాద్ తన ఇరవయ్యో యేట వ్యవస్థాపక ప్రస్థానాన్ని ప్రారంభించి , 1984 లో విశ్వవ్యాప్త వినియోగదారుల కోసం పారాసెటమాల్ తయారీని ఆరంభించారు . అమెరికాకు వివరాలను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీలలో ఒకటిగా గ్రాన్యూల్స్ ఇండియాను మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు .

అంటార్కిటా , ఉత్తర ధృవంతో సహా మొత్తం ఏడు ఖండాలలో నిర్వహించిన మారథాన్లలో తన శ్రీమతి ఉమాతో కలిసి ఆయన పాల్గొన్నారు . 2015 లో వారు ఏడు ఖండాలలో ఏడు మారథాలను ఏడు రోజుల్లో నిర్వహించే వరల్డ్ మారథాన్ ఛాలెంజ్ ను పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పారు . ఆరోగ్యం , విద్య , ఉపాధి , మానవ అభివృద్ధి , సంక్షేమ రంగాలలో గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మెరుగుపరచడం కోసం కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ స్వర్గ భారత ట్రస్టు హైదరాబాద్ విభాగం అధ్యక్షుడిగా కృష్ణ ప్రసాద్ సేవలందిస్తున్నారు .

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago