politics

గ్రాన్యూల్స్ సీఎండీకి గీతం గౌరవ డాక్టరేట్… గీతం స్నాతకోత్సవంలో ప్రదానం

పటాన్ చెరు:

గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఈనెల 28 న ( రవారం ) నిర్వహించనున్న 12 వ స్నాతకోత్సవంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నారు . ఈ విషయాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శవరావ ఎకృష్ణ అధ్యక్షత జరిగే ఈ స్నారకోత్సవంలో దాదాపు 1300 మంది విద్యార్థులకు పబ్బాలను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు .

కృష్ణ ప్రసాద్ గురించి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పారిశ్రామిక అనుభవం ఉన్న కృష్ణ ప్రసాద్ తన ఇరవయ్యో యేట వ్యవస్థాపక ప్రస్థానాన్ని ప్రారంభించి , 1984 లో విశ్వవ్యాప్త వినియోగదారుల కోసం పారాసెటమాల్ తయారీని ఆరంభించారు . అమెరికాకు వివరాలను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీలలో ఒకటిగా గ్రాన్యూల్స్ ఇండియాను మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు .

అంటార్కిటా , ఉత్తర ధృవంతో సహా మొత్తం ఏడు ఖండాలలో నిర్వహించిన మారథాన్లలో తన శ్రీమతి ఉమాతో కలిసి ఆయన పాల్గొన్నారు . 2015 లో వారు ఏడు ఖండాలలో ఏడు మారథాలను ఏడు రోజుల్లో నిర్వహించే వరల్డ్ మారథాన్ ఛాలెంజ్ ను పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పారు . ఆరోగ్యం , విద్య , ఉపాధి , మానవ అభివృద్ధి , సంక్షేమ రంగాలలో గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మెరుగుపరచడం కోసం కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ స్వర్గ భారత ట్రస్టు హైదరాబాద్ విభాగం అధ్యక్షుడిగా కృష్ణ ప్రసాద్ సేవలందిస్తున్నారు .

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

16 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

16 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

16 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago