politics

గ్రాన్యూల్స్ సీఎండీకి గీతం గౌరవ డాక్టరేట్… గీతం స్నాతకోత్సవంలో ప్రదానం

పటాన్ చెరు:

గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఈనెల 28 న ( రవారం ) నిర్వహించనున్న 12 వ స్నాతకోత్సవంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నారు . ఈ విషయాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శవరావ ఎకృష్ణ అధ్యక్షత జరిగే ఈ స్నారకోత్సవంలో దాదాపు 1300 మంది విద్యార్థులకు పబ్బాలను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు .

కృష్ణ ప్రసాద్ గురించి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పారిశ్రామిక అనుభవం ఉన్న కృష్ణ ప్రసాద్ తన ఇరవయ్యో యేట వ్యవస్థాపక ప్రస్థానాన్ని ప్రారంభించి , 1984 లో విశ్వవ్యాప్త వినియోగదారుల కోసం పారాసెటమాల్ తయారీని ఆరంభించారు . అమెరికాకు వివరాలను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీలలో ఒకటిగా గ్రాన్యూల్స్ ఇండియాను మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు .

అంటార్కిటా , ఉత్తర ధృవంతో సహా మొత్తం ఏడు ఖండాలలో నిర్వహించిన మారథాన్లలో తన శ్రీమతి ఉమాతో కలిసి ఆయన పాల్గొన్నారు . 2015 లో వారు ఏడు ఖండాలలో ఏడు మారథాలను ఏడు రోజుల్లో నిర్వహించే వరల్డ్ మారథాన్ ఛాలెంజ్ ను పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పారు . ఆరోగ్యం , విద్య , ఉపాధి , మానవ అభివృద్ధి , సంక్షేమ రంగాలలో గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మెరుగుపరచడం కోసం కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ స్వర్గ భారత ట్రస్టు హైదరాబాద్ విభాగం అధ్యక్షుడిగా కృష్ణ ప్రసాద్ సేవలందిస్తున్నారు .

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

58 minutes ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

3 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago