మనవార్తలు ,పటాన్ చెరు :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ‘ అనిశ్చితి సమయంలో సుస్థిరత , వినూత్న నిర్వహణ పద్ధతులు ‘ అనే అంశంపై డిసెంబర్ 3-4 తేదీలలో రెండు రోజులు అంతర్జాతీయ వర్చువల్ సదస్సును నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకులు ప్రొఫెసర్ ఆర్.రాధిక , ప్రొఫెసర్ ఎం.జయశ్రీలు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . కోవిడ్ -19 ద్వారా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి సంస్థలు అనుసరించిన వినూత్న నిర్వహణ పద్ధతులపై చర్చించడం , విద్యావేత్తలు , పరిశోధకులు , నిర్వహణ నిపుణులకు ఒక వేదికను అందించడం ఈ సదస్సు లక్ష్యమని తెలిపారు . ఇది మహమ్మారి , పునరుద్ధరణ వ్యూహాలను ఎదుర్కోవడానికి ఆలోచనలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుందని , ప్రపంచ నలుమూలల నుంచి సదస్యులను ఆహ్వానిస్తోందన్నారు . పేర్ల నమోదు , తదితర వివరాల కోసం finghbscon21@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని వారు సూచించారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…