Hyderabad

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…

 మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…

– మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్..

పటాన్ చెరు:

కోవిద్ 19 ను అంతమోదించడానికి సామాజిక దూరం పాటించడం ,మాస్క్ ధరించడంతో పాటు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొల్కురి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు.

అనంతరం నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశీయ వాక్సిన్ ను పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారందరికీ ఉచితంగా అందిస్తామని మోది ప్రకటనతో దేశవ్యాప్తంగా మోదీ ఫ్లేక్సీలకు, చిత్రపటాలకు పూలాభిషేకాలు మరియు పాలాభిషేకాలు బిజెపి కార్యకర్తలు నిర్వహించారు

జాతినుద్దేశించిన ప్రసంగించిన భారతప్రధాని నరేంద్ర మోదీ గారు దేశప్రజలందరికీ వరాలజల్లులు కురిపించారని తెలిపారు..పద్దెనిమిది సంవత్సరాలు నిండిని భారతపౌలందరికీ జూన్ 21 నుండి ఉచితంగా కోవిడ్ టీకాలు అందిస్తామని అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు.ప్రవేటు ఆసుపత్రులకు ఇరవైదు శాతం టీకాలు అందిస్తామని..అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం నవంబర్ (దీపావళి) వరకు పొడిగిస్తు ఎనభైకోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు… నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజసంక్షేమం కోసం కట్టుబడి ఉందని, మోది ప్రభుత్వం కరోనాతో, శత్రుదేశాలతో యుద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు మోదితో యుద్ధం చేస్తున్నారని జగదీశ్వర్ గౌడ్ విమర్షించారు.టీకాల విషయంలో ప్రతిపక్షాల పుకార్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ప్రజలంతా మోదికి అండగా ఉన్నారని తెలిపారు.. డిసెంబర్ నాటికి ప్రతి భారతీయుడికి టీకా ఖచ్చితంగా అందుతుందని కరోనా జయించడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కొల్కురి రాజశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు, ఆశిష్ గౌడ్ బీజేవైఎం రాష్ట్ర ఉప అధ్యక్షుడు, శ్రీనివాస్ గుప్తా, సుజాత, మురళీధర్ వర్మ, అంతం గౌడ్, జగన్ రెడ్డి, అంగడి బాలరాజు, రాజు గౌడ్ బిజెపి కార్యకర్తలు, మోది అభిమానులు పాల్గొన్నరు..

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago