Hyderabad

టిఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గ ప్రకటన

పార్టీ పటిష్టతకు సైనికుల వలే కృషి చేయాలి
ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు విద్యార్థి, యువజన విభాగాల నాయకులు సైనికుల వలె కృషిచేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్త ను పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు.

టిఆర్ఎస్ పార్టీలో విద్యార్థి, యువజన విభాగాల దే కీలక పాత్ర అన్నారు. కష్ట పడిన ప్రతి ఒక్కరికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో యువత మత్తుకు బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు అప్రమత్తంగా ఉండి, సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యత ఈ రెండు విభాగాలపై ఉందన్నారు.

నియోజకవర్గ స్థాయిలో క్రీడారంగానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, నూతన స్టేడియాలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నియోజకవర్గ స్థాయి యువజన విభాగం అధ్యక్షులు గా శ్యాంసుందర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా చెన్నారెడ్డి లు ఎన్నికయ్యారు. అనంతరం నియోజకవర్గలోని నాలుగు మండలాలు, మూడు మున్సిపాలిటీలు, మూడు డివిజన్ల నూతన కార్యవర్గలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, సోమిరెడ్డి, విజయ్ కుమార్, గూడెం విక్రమ్ రెడ్డి, మెరజ్ ఖాన్, కృష్ణ కాంత్, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

11 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

11 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

11 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

23 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago