అమీన్పూర్
ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. గురువారం అమీన్పూర్ ఎంపీపీ దేవానందం అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం దరిచేరకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత అధికారులకు, ప్రజాప్రతినిధుల పైన ఉందన్నారు. అనవసర వివాదాల అంశాల్లో తలదూర్చకూడదని సూచించారు.
రాష్ట్రంలో అతి చిన్న మండలంగా ఉన్న అమీన్పూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. మండల పరిషత్ సమావేశంలో చర్చించిన అంశాలను నెలకోసారి తిరిగి చర్చించుకోవాలని సూచించారు. ఎప్పుడు ఎక్కడ సమస్య తలెత్తినా తనను సంప్రదించాలని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను 100% సాధించాలంటే సమన్వయంతో పని చేసినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిధులతో పాటు, సీఎస్ఆర్ నిధులు సైతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో మల్లేశ్వర్, తహసిల్దార్ విజయ్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…