Telangana

ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బిరం గూడ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ప్రశాంత్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.బీఎస్పీ రాష్ట్ర నాయకులు సతీష్ మాట్లాడుతూఅంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు . ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు . విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహౌన్నత వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని వారు కొనియాడారు.

యువజన నాయకులు జి. నిరంజన్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడంతో పాటు, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అంబేద్కర్ అందరివాడు కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని , ఎంతకాలం బ్రతికామన్నది కాదని ప్రజలతో ఆదరణ పొందే విధంగా ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమని ఆయన తెలిపారన్నారు. అంబేద్కర్ ను ఉన్నతంగా నిలిపి, సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఒక గొప్ప మహా వ్యక్తిగా నిలిచిపోతారని ,ఆత్మన్యూనతకు, దుర్భలత్వానికి గురయ్యే ఆలోచనల్లో కూరుకుపోకుండా, గొప్పగా ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్ అని సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్  తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొడ్డు వంశీకృష్ణ,కిరణ్ కుమార్, ఎడ్ల నవీన్, అనిల్ సింగ్, ముక్తవరం సాయి కిరణ్, పరంకుషం కృష్ణ ,ప్రణీత్, దెవన్ జాక్సన్, అంబేద్కర్ యూత్ సభ్యులు, భీమ్ యంగ్ స్టార్స్ పాల్గొని విజయవంతం చేశారు.

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

6 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

6 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago