Telangana

సామాజిక సేవలో అందరు భాగస్వాములు అవ్వాలి పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి

_పేదలకు అందుబాటులో వైద్యం
అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర

_బడుగు జీవులకు ఖరీదైన వైద్యం
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
సామాజిక సేవలు విస్తరిస్తాం

_మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్

అమేధ హాస్పిటల్స్ సౌజన్యంతో,మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకరకంగా సామాజిక సేవలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి ఉంటుందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో అమేధ హాస్పిటల్స్  సౌజన్యంతో మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమేధ హాస్పిటల్స్ యజమాన్యం వందమందికి పైగా పలు రకాల వైద్య సేవల తోపాటు ఉచిత మందులు, టెస్టులు నిర్వహించారు. అవసరమైన వారికి హాస్పిటల్ కి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతు పట్టణ ప్రాంతాలలో కొంతమేర వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ రూరల్ ఏరియాలో అవగాహన లేమితో ప్రజలు ఫ్రీ డయాబెటిక్, డయాబెటిక్ వంటి రోగాల బారిన పడుతు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయటంతో పాటు వారిలో అవగాహన తో పాటు చైతన్య పరచలాని సూచించారు.

అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర మాట్లాడుతు పటాన్ చెరు పట్టణంలో హాస్పిటల్ పెట్టిన రోజు నుంచి కార్మికులు,పేద, మధ్యతరగతి వాళ్లకు కమర్షియల్ ఆలోచన తో కాకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ముందు కూడా సామాజిక సేవ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతామని గ్రామాలలో అందరి సహాయ సహకారాలతో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంవికే ఫౌండర్ రాజయ్య మాట్లాడుతు ప్రైవేటు హాస్పిటల్ వైద్యం అంటేనే ఖరీదైనదిగా భావిస్తున్న ఈ రోజుల్లో అన్ని సదుపాయాలతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తూ అట్టడుగు బడుగు జీవులలో వెలుగు నింపుతున్న అమేధ హాస్పిటల్స్ యజమాన్యాన్ని అభినందించారు.మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ మా సంస్థ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనంజయ్,రాజశేఖర్, చిరంజీవి, సిఐటియు నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి నాగేశ్వరరావు, అర్జున్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago