Telangana

ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోండి…

– విద్యార్థులకు జిల్లా పరిషత్ హెస్ట్కూల్ హెడ్ మాస్టర్ రమాదేవి ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులంతా ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోవాలని, ఆ లక్షణం ఉన్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రుద్రారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. రమాదేవి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘జాతీయ సైన్స్ దినోత్సవం’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరణలకు బాటలు వేసిందని, శాస్త్రీయ ఫలాలు సామాన్య మానవుల శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో ఆహారం, శక్తి కొరతను మానవాళి ఎదుర్కోబోతోందని, వాటికి ప్రత్యామ్నాయాలను కనుగొనాలని భావి శాస్త్రవేత్తలకు ఆమె సూచించారు.

తొలుత, స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష అధ్యక్షోపన్యాసం చేయగా, రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీవీ నాగేంద్ర కుమార్ వందన సమర్పణ చేశారు. గీతం బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి తదితరులు శాస్త్రీయంగా మానవాళికి ఇతోధిక సేవలందించిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవడంతో పాటు తమ పాఠశాల రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తృణ ధాన్యాలపై రూపొందించిన వార్షిక ఈ-పత్రికను ఆవిష్కరించారు.

ఆ తరువాత రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన శాస్త్రీయ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పలు మోడళ్ళు ఎలా పనిచేస్తున్నాయో, వాటి వెనుక ఉన్న సెన్స్డ్ ఏమిటి అనే అంశాలను విద్యార్థులు అడిగి తెలుసుకోవడం ముచ్చటేసింది.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

2 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

2 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

2 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

2 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

2 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago