స్కెచింగ్ కార్యశాలలో ఆర్కిటెక్చర్ విద్యార్థులకు శిక్షకుల సూచన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆర్కిటెక్చర్ విద్యార్థులలో నిబిడీక`తంగా ఉన్న కళాత్మకతకు సాంకేతికతను జోడిస్తే అటు ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, ఇటు వారి సృజనాత్మక ఆలోచనలను మరింత పెంపొందించుకోవచ్చని శిక్షకురాలు సానియా షర్పున్నీసా అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రెండు రోజుల స్కెచింగ్ కార్యశాలను నిర్వహించారు. ఆర్కిటెక్చరల్ డిజైన్ రంగంలో కీలకమైన దృక్పథం, షేడింగ్, నిష్పత్తులతో సహా అవసరమైన స్కెచింగ్ టెక్నిక్ లపై లోతైన అవగాహన ఈ వర్క్ షాప్ లో కల్పించారు.సాధారణమైన వాటిని సంక్లిష్టమైన, ఆకర్షణీయమైన స్కెచ్ లుగా మార్చడం, ప్రాదేశిక సంబంధాలను దృశ్యమానం చేయగల వారి సామర్థాన్ని, క్రియాత్మక, సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన భవనాలను రూపొందించడంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇందులో పాల్గొన్నవారు సాధన చేశారు. హాచింగ్, షేడింగ్ వంటి సాంకేతికతలను కూడా ఈ సందర్భంగా వారికి వివరించారు. ఈ కార్యశాలలో నిర్వహించిన ముఖాముఖిలో విద్యార్థుల మధ్య చిట్కాలు, సాంకేతికతల మార్పిడిని ప్రోత్సహించారు. కార్యశాల ముగిసే సమయానికి విద్యార్థులు తమ డ్రాయింగ్ లో ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, వారి సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరచుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…