అమీన్పూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా చివరి రోజైన శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంపొందించాలన్న సమున్నత లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఇందుకు అనుగుణంగా వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ కోట్లాది మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం తో పాటు, సరిపడ నిధులు సైతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి వార్డు లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజల సమక్షంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…