Telangana

యశ్వంత్పూర్, చిక్బల్లాపూర్ వ్యవసాయ మార్కెట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ బృందం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

రానున్న రోజుల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దబోతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ టూర్ లో భాగంగా బుధవారం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని యశ్వంత్పుర్, చిక్బల్లాపూర్ మార్కెట్ యాడలను ఎమ్మెల్యే జిఎంఆర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆయా మార్కెట్ కమిటీల అధికారులతో సమావేశమై క్రయ విక్రయాలు, దుకాణాల కేటాయింపులు, వ్యాపార నిర్మాణ అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అతి కొద్ది కాలంలోనే ఏటా ఆరు కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకోవడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago