Telangana

అ’పూర్వ’ సమ్మేళనం.. మధుర స్నేహ గీతం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘హోమ్ కమింగ్’ పేరిట శనివారం వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు తిరిగి కలుసుకోవడానికి, వారి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, వారి విజయాలను ప్రశంసించి, ప్రోత్సహించడానికి, అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు.ఆయా విభాగాల వారీగా విద్యార్థుల సమ్మేళనంతో ఆరంభమైన ఈ కార్యక్రమం, ముఖాముఖి చర్చలు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, విశ్వవిద్యాలయంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించడంతో పాటు పసందైన విందును ఆస్వాదించే వరకు కొనసాగింది.ఆ తరువాత విశ్వవిద్యాలయ స్థాయిలో శివాజీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా పాల్గొన్నారు. ఎన్నో పనులలో నిమగ్నమైన వారు తమ నిలువైన సమయాన్ని తన తోటి సహచరులతో పాటు ప్రస్తుత విద్యార్థులతో గడపడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి స్వాగత ప్రసంగంలో హర్షం వెలిబుచ్చారు.ఎంతో శ్రమకోర్చి వచ్చి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులకు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ కృ తజ్ఞతలు తెలియజేశారు. వారంతా విశ్వవిద్యాలయంతో మరింత మమేకం కావాల్సిన అశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. వివిధ కార్యక్రమాల ద్వారా తను మద్దతును కొనసాగిస్తున్న పూర్వ విద్యార్థులకు గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ధన్యవాదాలు తెలిపారు.

కార్నివాల్, స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్పో వంటి ఆహ్లాదకరమైన సాంకేతిక కార్యకలపాలలో విద్యార్థులు పాల్గొని, తమ అధ్యాపకులతో పలు అంశాలను ముచ్చటించారు. పూర్వ విద్యార్థులను మధుర క్షణాలను మరింత ఆనందమనం చేసే లక్ష్యంతో ఏర్పాటుచేసిన క్రీడా పోటీలు బృంద స్ఫూర్తిని చాటటడమేగాక వారిలోని నెపుణ్యాలను ప్రదర్శించే వీలు కల్పించాయి. ఇక చివరిగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే గాక మరపురాని అనుభూతులను మిగిల్చాయి.’హోమ్ కమింగ్-2023)ను నిర్వహించినందుకు, తమ పూర్వ విద్యార్థులతో మళ్లీ అనుసంధానం కావడం, ఈ ప్రాంగణంలో వారు గడిపిన సమయాన్ని జ్ఞాపకం చేసుకోవడం చూసి తాము మథురానుభూతికి లోనయినట్టు పూర్వ విద్యార్థుల వ్యవహారాల డిప్యూటీ డెరైక్టర్ నవీన్ సినపాత్రుని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులు తిరిగి తాము చదివిన విద్యా సంస్థను సందర్శించడానికి, ప్రస్తుత విద్యార్థులతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి వీలు కల్పించిందన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago