Telangana

అ’పూర్వ’ సమ్మేళనం.. మధుర స్నేహ గీతం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘హోమ్ కమింగ్’ పేరిట శనివారం వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు తిరిగి కలుసుకోవడానికి, వారి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, వారి విజయాలను ప్రశంసించి, ప్రోత్సహించడానికి, అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు.ఆయా విభాగాల వారీగా విద్యార్థుల సమ్మేళనంతో ఆరంభమైన ఈ కార్యక్రమం, ముఖాముఖి చర్చలు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, విశ్వవిద్యాలయంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించడంతో పాటు పసందైన విందును ఆస్వాదించే వరకు కొనసాగింది.ఆ తరువాత విశ్వవిద్యాలయ స్థాయిలో శివాజీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా పాల్గొన్నారు. ఎన్నో పనులలో నిమగ్నమైన వారు తమ నిలువైన సమయాన్ని తన తోటి సహచరులతో పాటు ప్రస్తుత విద్యార్థులతో గడపడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి స్వాగత ప్రసంగంలో హర్షం వెలిబుచ్చారు.ఎంతో శ్రమకోర్చి వచ్చి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులకు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ కృ తజ్ఞతలు తెలియజేశారు. వారంతా విశ్వవిద్యాలయంతో మరింత మమేకం కావాల్సిన అశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. వివిధ కార్యక్రమాల ద్వారా తను మద్దతును కొనసాగిస్తున్న పూర్వ విద్యార్థులకు గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ధన్యవాదాలు తెలిపారు.

కార్నివాల్, స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్పో వంటి ఆహ్లాదకరమైన సాంకేతిక కార్యకలపాలలో విద్యార్థులు పాల్గొని, తమ అధ్యాపకులతో పలు అంశాలను ముచ్చటించారు. పూర్వ విద్యార్థులను మధుర క్షణాలను మరింత ఆనందమనం చేసే లక్ష్యంతో ఏర్పాటుచేసిన క్రీడా పోటీలు బృంద స్ఫూర్తిని చాటటడమేగాక వారిలోని నెపుణ్యాలను ప్రదర్శించే వీలు కల్పించాయి. ఇక చివరిగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే గాక మరపురాని అనుభూతులను మిగిల్చాయి.’హోమ్ కమింగ్-2023)ను నిర్వహించినందుకు, తమ పూర్వ విద్యార్థులతో మళ్లీ అనుసంధానం కావడం, ఈ ప్రాంగణంలో వారు గడిపిన సమయాన్ని జ్ఞాపకం చేసుకోవడం చూసి తాము మథురానుభూతికి లోనయినట్టు పూర్వ విద్యార్థుల వ్యవహారాల డిప్యూటీ డెరైక్టర్ నవీన్ సినపాత్రుని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులు తిరిగి తాము చదివిన విద్యా సంస్థను సందర్శించడానికి, ప్రస్తుత విద్యార్థులతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి వీలు కల్పించిందన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago