పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నోవాపాన్ చౌరస్తా, పాత మార్కెట్, శ్రీ రామ్ నగర్ కాలనీల పరిధిలో జాతీయ రహదారి పై గల మురుగు నీటి సమస్యను వారం రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారుల కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు.
జిహెచ్ఎంసి, జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, స్థానిక కార్పొరేటర్ పెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన స్వయంగా సమస్యలను పరిశీలించారు. వర్షాకాలంలో మురుగు నీటితోపాటు వర్షపు నీరు జాతీయ రహదారి పైకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఇందుకోసం తన సొంత నిధులతో పైపులు కొనుగోలు చేసి అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే బాక్స్ డ్రైనేజి పైపులైను సైతం పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆయా శాఖల అధికారులు సత్యనారాయణ, వెంకటరమణ, రామకృష్ణ, రవీందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…