Telangana

జ్యోతి విద్యాలయలో ఘనంగా స్టూడెంట్ ఫెస్ట్

_పిల్లలను కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దాలి – డిసిపి శిల్పవ ళ్లి

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు చక్కటి చదువుతోపాటు చక్కటి గుణగణాలను నేర్పుతూ అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలని మాదాపూర్ డిసిపి శిల్పవల్లి అన్నారు. బిహెచ్ఇఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో నిర్వహించిన స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. పిల్లలను కేవలం చదువుకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్, ట్రెండ్ అనే ధోరణిలో పడి పెడదోవ పెట్టె అవకాశం ఉంది కాబట్ట తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

వివేకంతో కూడిన విద్యను అందించాలని కోరారు. పిల్లలను అతిగారాభంగా కాకుండా వారిని స్వసక్తితో ఎదిగే విధంగా సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా తయారయ్యేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమాజం పై అవగాహన లేకపోవడం వారిపై వారికి నమ్మకం లేకపోవడం వంటి లక్షణాలతో నేడు అనేక విధాలుగా సమాజంలో చెడిపోయిన వ్యక్తులుగా మారుతున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటినుండి వారి పనులు వారు చేసుకుంటూ , ఇతరులకు సాయం చేసే విధంగా సమాజంలో గొప్ప వ్యక్తులుగా మారెందుకు మన వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ జయసుధ, హై కోర్ట్ అద్వకేట్ తులసి రాజ్ గోకుల్, రెఫరెండ్ ఫాదర్ సంతురాజ్, స్కూల్ కరస్పాండెంట్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, జగధీష్, లతాచౌదరి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

22 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

22 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

22 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago