త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….
అమీన్ పూర్:
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు లింగమయ్య కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన అంగన్వాడి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…. 24 వార్డులలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఏర్పడిన అమీన్పూర్ పరిధిలో ప్రభుత్వ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్న మాట వాస్తవమేనని, అతి త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన రక్షిత మంచి నీరు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మూడు ఎకరాల్లో మినీ స్టేడియం, రాక్ గార్డెన్, పోలీస్ స్టేషన్ కోసం పక్కా భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీరంగూడ గుట్టపై ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం పది ఎకరాల కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు కృష్ణ, కొల్లూరు మల్లేష్, గోపాల్, మల్లేష్, యూసుఫ్, బిజిలి రాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…