Hyderabad

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….

అమీన్ పూర్:

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు లింగమయ్య కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన అంగన్వాడి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…. 24 వార్డులలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఏర్పడిన అమీన్పూర్ పరిధిలో ప్రభుత్వ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్న మాట వాస్తవమేనని, అతి త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన రక్షిత మంచి నీరు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మూడు ఎకరాల్లో మినీ స్టేడియం, రాక్ గార్డెన్, పోలీస్ స్టేషన్ కోసం పక్కా భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీరంగూడ గుట్టపై ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం పది ఎకరాల కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు కృష్ణ, కొల్లూరు మల్లేష్, గోపాల్, మల్లేష్, యూసుఫ్, బిజిలి రాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago