త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….
అమీన్ పూర్:
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు లింగమయ్య కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన అంగన్వాడి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…. 24 వార్డులలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఏర్పడిన అమీన్పూర్ పరిధిలో ప్రభుత్వ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్న మాట వాస్తవమేనని, అతి త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన రక్షిత మంచి నీరు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మూడు ఎకరాల్లో మినీ స్టేడియం, రాక్ గార్డెన్, పోలీస్ స్టేషన్ కోసం పక్కా భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీరంగూడ గుట్టపై ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం పది ఎకరాల కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు కృష్ణ, కొల్లూరు మల్లేష్, గోపాల్, మల్లేష్, యూసుఫ్, బిజిలి రాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన ఘోర…
గౌరవ సలహాదారుగా చుక్కా రాములు గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి అధ్యక్షులుగా ఉపేందర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు…
మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: దేశ వ్యాప్త పల్స్…