మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణంలోని ఈ – క్లబ్ గురువారం ‘ స్టార్టప్ మేళా’ని ఉల్లాసంగా , ఉత్సాహంగా నిర్వహించింది . ఇప్పటికే ఉన్న సభ్యులను ప్రోత్సహించి , వారిలో ఉత్సాహాన్ని ఇనుమడింపజేయడానికి , కొత్త వారిని ఆకర్షించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు . ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ , మహోత్సవ్ , వెంచర్ డెవలప్మెంట్ సెంటర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు . పర్యావరణవేత్త , చెట్ల పెంపం ప్రేమికుడు , జంతు సంరక్షణపై చాలా మక్కువ గల అవినాష్ నారాయణ స్వామితో శివాజీ ఆడిటోరియంలో ‘ ఎకో – చాట్ ‘ పేరిట ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు . సామాజిక ఆరోగ్యానికి ఆయన చేసిన కృషి , సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వామ్యం తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు . వారు అడిగిన పలు ప్రశ్నలకు సందర్భోచిత సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు .
ఐడియా పోస్టర్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో విద్యార్థులు విరివిగా పాల్గొని , పలువురి ప్రశంసలందుకున్నారు . సాంస్కృతిక ప్రదర్శనలు , వినోదభరితమైన స్కిట్లు ఆహుతులను ఉర్రూతలూగించాయి . ఫుడ్ , ఫ్యాషన్ స్టాళ్లు అన్నివేళలా క్రిక్కిరిసిపోయాయి . ఈ – క్లబ్ నూతన సభ్యులకు ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేశారు . ఈ – క్లబ్ గురించి : విద్యార్థులలో వ్యవస్థాపక నెపుణ్యాలను పెంపొందించి , ఒక అభ్యాస – పనిచేసే వాతావరణం కల్పించేది ఈ – క్లబ్ . ఆయా కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా ప్రాథమిక అవగాహన ఏర్పరచుకుని , వ్యవస్థాపకు లుగా ఎదగడానికి ఉపకరిస్తుంది . ఆయా రంగాల నిపుణులతో ముఖాముఖి ఏర్పాటు , ఆలోచనలకు పదునుపెట్టి ఓ రూపాన్నిచ్చేలా పోస్టర్ ప్రజెంటేషన్ , ఇతర క్లబ్లతో ఉమ్మడి కార్యక్రమాలు , వర్క్షాప్లను ఈ – క్లబ్ నిర్వహిస్తుంటుంది .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…