నీలం మధు ముదిరాజ్ ను సన్మానిస్తున్న చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం
_చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం
మనవార్తలు ,పటాన్ చెరు:
నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన చిట్యాల (చాకలి) ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిట్కుల్ గ్రామంలో విగ్రహ దాత నీలం మధు ముదిరాజ్ ను రాష్ట్ర రజక సంఘం నేతలతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరుగని ధైర్యసాహసాలను ప్రదర్శించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని నింపుతూ ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రజకుల తరపున మధుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి జీతయ్య, చిట్కుల్ వెంకటేశ్, సత్తయ్య, ఆంజనేయులు, సురేష్ లతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…