మనవార్తలు ,పటాన్ చెరు:
సృజనాత్మక వేడుకలు ఒత్తిడిని అధిగమించేలా చేస్తాయని , సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయని , అంతిమంగా ఉజ్వల భవతకు బాటలు వేస్తాయని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని అన్వేషణ , కళాకృతి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘ ధోల్ – ఎ – జర్న్ ‘ పేరిట శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు . విభిన్న సాంస్కృతిక , ఉత్సాహ పూరిత అంశాల మేళవింపుతో రూపకల్పన చేసిన ఈ ఒక రోజు కార్యక్రమాన్ని ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్యలు లాంఛనంగా ప్రారంభించారు .
రోజువారీ కార్యకలాపాలకు భిన్నంగా నిర్వహించే ఇటువంటి సాంస్కృతిక పోటీలలో పాల్గొనడం వల్ల ఒక రకమైన సుహృద్భావ వాతావరణం వెల్లివిరుస్తుందని , కొత్త అనుబంధాలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడ్డారు . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలు వెలికితీసే వేదికలుగా సాంస్కృతికోత్సవాలు తోడ్పడతాయని , మెత్రీభావవను పెంపొందించి , బృందాలు కలిసి పనిచేసే సంస్కృతికి బాటలు వేస్తాయని డెరైక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లెఫ్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ అన్నారు .
ఈ ఒకరోజు వేడుకలలో భాగంగా దాండియా , బతుకమ్మ , పలు సాంస్కృతిక కార్యక్రమాలు , ఫుడ్ స్టాళ్లు , ఫోటోబూత్లు వంటి పలు ఆకట్టుకునే అంశాలను అన్వేషణ , కళాకృతి విద్యార్థులు నిర్వహించారు . గీతం విద్యార్థులంతా ఎంతో ఉత్సాహభరింతగా వాటిలో పాల్గొని తమలో దాగివున్న ప్రతిభను చాటారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…