మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో శనివారం ‘ సినిమాటిక్ డే ‘ ( రీల్ టు రియల్ ) ని విద్యార్థులు ఉత్సాహంగా , ఉల్లాసంగా నిర్వహించారు . భారతీయ సినిమా , ఫ్యాషన్ పోకడలపై దాని ప్రభావాన్ని ప్రతిబింబించేలా ‘ వస్త్రనోవా ‘ ( గీతం విద్యార్థి విభాగం ) దీనిని ఏర్పాటు చేసింది . ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే , చలనచిత్ర ప్రేమికుల మనస్సులకు ఇష్టమైన పాత్రను ధరించడం , లేదా అభినయించడం , లేదా తిరిగి సృష్టించిన దృశ్యాలను ఆస్వాదించడం . వాటికి ప్రణాళికాబద్ధమైన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జతచేసి విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం . దాదాపు ఆయా అంశాలన్నింటిలో గీతం విద్యార్థులు కృతకృత్యులయ్యారనే చెప్పొచ్చు . ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థులు / యువతలో కొత్త ఆలోచనలను రేకెత్తించి , వారిలో నిబిడీకృతంగా ఉన్న సాంస్కృతిక దృక్కోణాలను బహిర్గతం చేయడానికి తోడ్పడతాయని విద్యార్థి స్నేహిత్ అభిప్రాయపడ్డారు .
ఇటువంటి కార్యక్రమాల ద్వారా చిత్ర నిర్మాణ కళ , క్రాఫ్ట్ మొదలైన వాటిపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని మరో విద్యార్థి ప్రణవ్ పేర్కొన్నారు . గీతం విద్యార్థులలో అత్యధిక మంది ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడమే కాక , ఇతరుల ప్రదర్శనలను ఆస్వాదించారు . తమ ప్రతిస్పందనను కరతాళ ధ్వనుల రూపంలో మార్మోగించారు . వినూత్న వేడుక విద్యార్థుల ఉత్సుకతను మరింత పెంచిందనడంలో ఎటువంటి సందేహం లేదు .
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…