పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
అంగన్వాడీ ఉద్యోగలు చట్టపరంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే పరిష్కారం చేయకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టి న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని బానూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ సంధర్బంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ గత 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు పనికి తగ్గ ఫలితం ఇవ్వాలని,తమ న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించినా వినక పోవడం వల్లనే సమ్మెకు వెళ్ళడం జరిగిందన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మంచిది కాదన్నారు. ఇవ్వేవి చేయకుండా ఇతర డిపార్ట్ మెంటుకు సంబందించిన వారిని బెదిరించి నాగులపల్లి, సందు గూడెం, వెలిమెల అంగన్వాడీ సెంటర్లు తెరవాలని బలవంతంగా తాళాలు పగల గొట్టడం ఎంతవరకు సమంజస మ న్నారు.అంగన్వాడీ సెంటర్స్ లో వంట గ్యాస్ సిలిండర్లు, వంట సమాను,ఫ్రిస్కూల్ కిట్స్,బియ్యం,పప్పు,బాలామృతం, పాలు,నూనెలు,గుడ్లు, పిల్లలకు సంబందించిన ఆట వస్తువులు,రికార్డులు, డబ్బులు ఇలా అనేకం ఉన్నాయన్నారు. సెంటర్ల తాళాలు ఎవరైతే పగలగొట్టారో వారే భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పగలగొట్టిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో విజయలక్ష్మి హెల్పర్లు పాల్గోన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…