Telangana

అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన వారిపై కేసు నమోదు చేయాలి_సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అంగన్వాడీ ఉద్యోగలు చట్టపరంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే పరిష్కారం చేయకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టి న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని బానూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ సంధర్బంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ గత 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు పనికి తగ్గ ఫలితం ఇవ్వాలని,తమ న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించినా వినక పోవడం వల్లనే సమ్మెకు వెళ్ళడం జరిగిందన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మంచిది కాదన్నారు. ఇవ్వేవి చేయకుండా ఇతర డిపార్ట్ మెంటుకు సంబందించిన వారిని బెదిరించి నాగులపల్లి, సందు గూడెం, వెలిమెల అంగన్వాడీ సెంటర్లు తెరవాలని బలవంతంగా తాళాలు పగల గొట్టడం ఎంతవరకు సమంజస మ న్నారు.అంగన్వాడీ సెంటర్స్ లో వంట గ్యాస్ సిలిండర్లు, వంట సమాను,ఫ్రిస్కూల్ కిట్స్,బియ్యం,పప్పు,బాలామృతం, పాలు,నూనెలు,గుడ్లు, పిల్లలకు సంబందించిన ఆట వస్తువులు,రికార్డులు, డబ్బులు ఇలా అనేకం ఉన్నాయన్నారు. సెంటర్ల తాళాలు ఎవరైతే పగలగొట్టారో వారే భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పగలగొట్టిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో విజయలక్ష్మి హెల్పర్లు పాల్గోన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago