మహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ ఉజెర్కు డాక్టరేట్

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సఫల్యంపై విశ్లేషణ, దానిని సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెద్దరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి (రీసెర్చ్ స్కాలర్) ముహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ ఉన్న డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, సహ పర్యవేక్షకుడు ప్రొఫెసర్ బి. బస్వరాజ్ లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. అబ్దుల్ రెహ్మాన్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం సీహెడీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం. విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్, వర్మ, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గీతం ప్రాంగణంలోని చెట్లకు జియో ట్యాగ్

గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని చెట్లు, మొక్కలు, పొదలు, తీగ జాతులకు మంగళవారం జియో-బ్యాగ్  చేశారు. వాటికి అమర్చిన క్యూ-ఆర్-కోట్ను స్కాన్ చేయడం ద్వారా ఆయా మొక్కల వృక్షశాస్త్రి, సాధారణ పేర్లతో కూడిన వివరాలతో పాటు వాటి వర్గీకరణ, పుస్త లేదా ఫలాల వివరాన్నీ లభిస్తాయి. గత మూడు నెలలుగా శ్రమించి, గీతం మూడు ప్రాంగణాలలోని చెట్ల జాతులకు క్యూఆర్ కోడ్ ను ట్యాగ్ చేస్తున్నట్టు గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, విశాఖపట్నం సీనియర్ ప్రొఫెసర్ కె. మోహన్ తెలియజేశారు. ఈ జియో-ట్యాగింగ్ కార్యక్రమంలో రెసిడెంట్ డెరెక్టర్ డివీవీఎస్ ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్,హెదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *