యోగా దినచర్యలో భాగం కావాలి బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బీహెచ్ఈఎల్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో బిహెచ్ఇఎల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా భారతి నగర్ బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి తన ఆరోగ్యం పై దృష్టి పెట్టకపోవడం మూలంగా మానసిక, శారీరక సమస్యలతో నిరంతరం బాధపడుతూ అనారోగ్యకరమైన జీవితాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రజలకు యోగ ప్రాముఖ్యతను తెలియజేయాలన్నయోగాకు కులం మతం ప్రాంతం జాతి లేదని, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమని తెలిపారు. యావత్తు ప్రపంచానికి భారతదేశం అందించిన మహోన్నత సాధనం యోగ అని అన్నారు.ఈ కార్యక్రమంలో భారతి నగర్ బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి,వెంకట్ రెడ్డి గారు,హనుమంతరావు గారు, పవన్ గారు, ధీరజ్ సుబ్బారావు ,చంద్రం, చంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, రామకృష్ణ, బసవరాజు, శ్రీనివాసరావు, బాలకృష్ణ, చంద్రశేఖర్ ,గోపాల్ రెడ్డి, సాయి వెంకట హర్ష, శ్రీధర్ రెడ్డి ,వెంకన్న, పోచయ్య, బాల నరసింహ, శేషగిరి ,శ్రీనివాస్, హేమాద్రి, సత్యనారాయణ, తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *