మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పటాన్ చెరు మండలంలోని రుద్రారం దగ్గర ఆర్ కృష్ణయ్య ను బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 8 9 వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విదంగా ప్రభుత్వ పాఠశాలను మూసి వేసే నిర్ణయాన్ని వెంటనే వెనెక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన జిల్లాలో ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగం నాయకులు వెంకట్, సంతు, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
