రామచంద్రాపురం, మనవార్తలు :
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తించి హైదరాబాద్ లోని -శ్రీ పొట్టి శ్రీరాములు కళాభవన్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జరిగిన మహాత్మా గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగింది , ఈ అవార్డుతో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ పై సామాజిక సేవలో మరింత బాధ్యత పెరిగిందని, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తిస్తూ ఇన్ని అవార్డులు రావడం ఎంతగానో సంతోషాన్నిచ్చిందన్నారు. ఆర్ కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ చైర్మన్ ఆర్ కే రంజిత్ కు కంజర్ల కృష్ణమూర్తి చారి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…
బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…