Telangana

గీతమ్ లో ఘనంగా 154వ గాంధీ జయంతి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సత్యం, అహింస పట్ల గాంధీజీ అచంచలమైన నిబద్ధత ప్రపంచంపై చెరగని ముద్ర వేయడంతో పాటు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది ‘ఏక్ తారీఖ్ ఏక్ మంటా ఏక్ సార్ ‘ ఇతివృత్తంలో అక్టోబర్ 1న ఉదయం 10-11 గంటల వరకు పరిశుభ్రత కోసం గంట పాటు శ్రమదానం చేయాలని ఇచ్చిన పిలుపులో గీతం విద్యార్థులు కూడా పాల్గొన్నారు. తమ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు, వారి కమ్యూనిటీలలో పరిశుభ్రతను ప్రోత్సహించడంలో చురుకుగాపాల్గొనేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది.

గాంధీజీకి నివాళులర్పించే కార్యక్రమంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ సర్మ, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డెరైక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్సర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, స్కూల్ ఆఫ్ సెర్చ్ పూర్వ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ. రామరావు, ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్, పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ దేశానికి, ప్రపంచానికి చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా వారు మననం చేసుకున్నారు.మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడంతో పాటు నేటి ప్రపంచంలో ఆయన బోధనలు, సూత్రాల ప్రాముఖ్యతను గీతం ఉన్నతాధికారులు గుర్తుచేశారు. విశ్వవిద్యాలయం తన విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించడానికి, సామాజిక బాధ్యత, సత్యం, అహింసను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

2 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

14 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

17 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago