Telangana

గీతమ్ లో ఘనంగా 154వ గాంధీ జయంతి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సత్యం, అహింస పట్ల గాంధీజీ అచంచలమైన నిబద్ధత ప్రపంచంపై చెరగని ముద్ర వేయడంతో పాటు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది ‘ఏక్ తారీఖ్ ఏక్ మంటా ఏక్ సార్ ‘ ఇతివృత్తంలో అక్టోబర్ 1న ఉదయం 10-11 గంటల వరకు పరిశుభ్రత కోసం గంట పాటు శ్రమదానం చేయాలని ఇచ్చిన పిలుపులో గీతం విద్యార్థులు కూడా పాల్గొన్నారు. తమ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు, వారి కమ్యూనిటీలలో పరిశుభ్రతను ప్రోత్సహించడంలో చురుకుగాపాల్గొనేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది.

గాంధీజీకి నివాళులర్పించే కార్యక్రమంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ సర్మ, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డెరైక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్సర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, స్కూల్ ఆఫ్ సెర్చ్ పూర్వ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ. రామరావు, ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్, పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ దేశానికి, ప్రపంచానికి చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా వారు మననం చేసుకున్నారు.మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడంతో పాటు నేటి ప్రపంచంలో ఆయన బోధనలు, సూత్రాల ప్రాముఖ్యతను గీతం ఉన్నతాధికారులు గుర్తుచేశారు. విశ్వవిద్యాలయం తన విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించడానికి, సామాజిక బాధ్యత, సత్యం, అహింసను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు.

admin

Recent Posts

వచ్చే మూడు దశాబ్దాలూ వెక్టర్ డేటాబేస్ లదే

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…

4 hours ago

పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…

1 day ago

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…

1 day ago

పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…

1 day ago

గీతంలో ‘సాధన-2025’ పేరిట కళా ప్రదర్శన

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత,…

1 day ago