మనవార్తలు ,పటాన్ చెరు:
హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఇటీవల ది ఫార్మా పాఠశాలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఫార్మా పాఠశాల మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణతో తాను , తమ అసోసియేట్ ప్రొఫెసర్ కింగ్స్టన్ రాజయ్య అవగాహనా ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు తెలియజేశారు . ఫార్మా పాఠశాల అనేది విద్యావేత్తలు , ఫార్మా పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం అనే ప్రధాన ధ్యేయంతో హైదరాబాద్లో ఏర్పాటైన ఉద్యోగ – ఆధారిత ఫార్మా శిక్షణ , నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆయన వివరించారు . ఇది లెఫ్ సెన్సైస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్తో పాటు తెలంగాణ విద్యార్థులకు రాయితీలను అందించే టాస్క్ ( తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ) ల గుర్తింపు పొందినట్టు తెలిపారు . అంతేకాక , ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఉచిత శిక్షణ , ప్లేస్మెంట్ను కూడా అందిస్తుందన్నారు.
ఈ సౌకర్యాన్ని గీతం ఫార్మసీ విద్యార్థులకు కూడా అందజేయాలనే ఉద్దేశంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నామని , వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే శిక్షణా తరగతులకు కొంతమంది విద్యార్థులను పంపుతున్నట్టు ప్రిన్సిపాల్ తెలియజేశారు . అధునాతన ఫార్మా పరికరాలను వినియోగించడంలో వారి నెపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ శిక్షణ దోహదపడడమే గాక , విద్యార్థుల పని సంసిద్ధతను నిర్ధారిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…