Hyderabad

పెరిగిన విద్యుత్ నిత్యావసర సరుకుల పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గియలని రాస్తారోకో

మన వార్తలు, మియాపూర్:

పెరిగిన విద్యుత్ నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ధరలను బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ యు మియాపూర్ డివిజన్లో ఆల్విన్ చౌరస్తా దగ్గర జాతీయ రహదరిని దిగ్బంధం చేయడంచేశారు కార్యక్రమాన్ని ఉదేశించి గ్రేటర్ కార్యవర్గ సభ్యులు మైధం శెట్టి మాట్లాడుతు కరోనాతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మరింత భారం అయిపోయాయి గత రెండేళ్ల కాలంగా కరోనా మహామారితో ప్రజల జీవన ఉపాధి కరువైంది ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో వారిపై అధిక ధరలు పిడుగు పడింది కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు వేలదారి కోట్ల రుణమాఫీ పన్నులను ఉపసంహరించుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం ద్వారా రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి .

అంతర్జాతీయ మార్కెట్ రూట్ ఆయిల్ ధరలు తగ్గిన సందర్భంలో కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం అన్యాయం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ధనులు తగ్గిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఎన్నికలు అయిపోగానే భారీ మొత్తంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ప్రజలను మోసం చేశారని కేంద్రపైన మండిపడ్డారు. చిల్లర సమస్య అవుతుంది అని బస్ చార్జీలను కూడ రౌండ్ ఫిగర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెంచడం శోచనీయం మన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు విద్యుత్తు ప్రాజెక్టులు విరివిధిగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం పేద ప్రజలపై భారం మోపడమే. చాలా అన్యామని మైధం శెట్టి రాష్ట్రప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

అనంతరం ఎంసీపీయూ గ్రేటర్ కార్యదర్శి తుకారాం నయక్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం దేశాల ఆధిపత్య పోరులో ఉక్రెయిన్ పై జరుపుతున్న దాడి మూలంగా ఆ ధరలు పెరగడం ఒక కారణమని చెప్తున్నాది భుటకం. అధిక ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎంసీపీయూ గ్రేటర్ హైదాబాద్ కమిటీ డిమాండ్ చేస్తున్నాది.ఈ కార్యక్రమంలోగ్రేటర్ కార్యదర్శి కా| తుకారాం నాయక్, ఎంసీపీయూ గ్రేటర్ కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్, పల్లె మురళి డివిజన్ కార్యదర్శి కన్న శ్రీనివాస్ డివిజన్కమిటీ సభ్యులు
కే.రాజు,సుల్తానా, ఇంద్ర,శివాని,లక్ష్మి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

10 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

11 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago