దశాబ్దాలుగా వర్షాకాలంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న బండ్లగూడ వాసులకు త్వరలో ఊరట లభించనుంది. జాతీయ రహదారి నుండి బండ్లగూడ పరిధిలోని మార్క్స్ నగర్ మీదుగా దోషం చెరువు వరకు వరద నీటి మళ్ళింపు కాలువ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ బండ్లగూడ లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణం చేపట్టే ప్రాంతాలను పరిశీలించారు. జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టాలని సూచించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాలనీవాసులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…