మనవార్తలు ,పటాన్ చెరు
సంక్రాంతి పండుగ ముగ్గులతో మహిళలోని సృజనాత్మకత బయటపడుతుందని టిఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గం నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ అన్నారు. నియోజకవర్గ టిఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకులు మేరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇది మొదటి పండుగని, పాత ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త ఆలోచనలతో కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ప్రారంభం కానుండడంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన దేవేందర్ రాజు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…