* మెరుగైన సమాజ స్థాపనలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకం
* విశ్వభారతి లా కాలేజ్ కరస్పాండెంట్ రవి అనంత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గొప్ప విజయాలు సాధించే క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయని, వాటిని ఓపికగా అధిగమిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని విశ్వభారతి లా కాలేజ్ కరస్పాండెంట్ రవి అనంత అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో ఆటుపోట్లు సహజమన్నారు. శత్రువులు సృష్టించే అడ్డంకులను విజయ సోపానాలుగా మార్చుకొని ముందడుగు వేయాలన్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగిలోని విశ్వభారతి లా కాలేజ్ లో ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రవి అనంత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఓటమికి కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేసిన వారే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మెరుగైన సమాజ స్థాపనలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటూ నిరంతర విద్యార్థిగా ఉన్నవారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తమ కళాశాలలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణ, రజత పతకాలను అందించాలని నిర్ణయించామన్నారు. తమ తల్లి స్మారకార్థం విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ పతకాలను ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. చదువుతోనే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని, ఫ్యాకల్టీ సభ్యులు తేజశ్రీ, అన్వీ, కీర్తి, రమ్యశ్రీ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు
జూనియర్ విద్యార్థులను ఆహ్వానిస్తూ సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ ఫ్రెషర్స్ పార్టీ ఆద్యంత ఉత్సాహంగా సాగింది. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ విద్యార్థులు సందడి చేశారు. ఆసక్తికరంగా సాగిన గేమ్స్ లోనూ విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…