పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఇటీవల మూతపడిన ఇంపీరియల్ గార్మెంట్స్ పరిశ్రమ మహిళా కార్మికులకు ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, ఈఎస్ఐ నుండి రావలసిన బకాయిలు త్వరితగతిన ఇప్పించేందుకు కృషి చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం పరిశ్రమ మహిళా కార్మికులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పరిశ్రమ మూసివేసిన సందర్భంలోనూ ప్రతి కార్మికురాలికి మూడు లక్షల రూపాయలకు పైగా పరిహారం అందించామని తెలిపారు.రాబోయే రోజుల్లోనూ ప్రభుత్వపరంగా ప్రతి సంక్షేమ పథకాన్ని వర్తింపజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, తదితరులు పాల్గొన్నారు..
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…