గీతం ఫెస్ట్ లో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
మనం ఏ ప్రాంతం, కులం, భాష ఏదైనా, ముందుగా మనమంతా భారతీయులమని, అది నేటి యువత గుర్తెరిగి మసలుకోవాలని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను హితబోధ చేశారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న వార్షిక వేడుక ప్రమాణ-2026 ప్రారంభోత్సవంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయులుగా మనమంతా గర్వించాలని, ప్రపంచానికే దారిచూపిన, దిశా-నిర్ధేశనం చేసిన దేశం మనదన్నారు. రాళ్ళను నీటిపై తేలేలా చేసినా, నీటితో దీపాలు వెలిగించినా, రాళ్ళలో నుంచి రాగాన్ని పలికించినా.. అది భారతీయులకే సాధ్యమని చెప్పారు. మన విశ్వగురువుగా ఎదుగుతున్నామంటే, దానికి కారణం మన సంస్కృతి, ధర్మమని ఆయన పేర్కొన్నారు.
ఆధునిక పోకడలు (ట్రెండ్) ఆకర్షిస్తున్నా, మన ఆలోచనా ధోరణి (మైండ్ సెట్) మారకూడదని, మన సంస్కృతి, విలువలను మరువకూడదని విద్యార్థులకు బోయపాటి హితవు పలికారు. తల్లిదండ్రులు, గురువులను మరవొద్దని, నమ్ముకున్న ఆశయాన్ని వదలొద్దని, అవరోధాలు ఎదురైనా ముందడుగే వేయాలని, వైఫల్యాలకు వెరవొద్దని సూచించారు. అప్పుడే మంచి భవిష్యత్తు సాధ్యపడుతుందని చెప్పారు. చదువు వల్ల సంస్కారం అలవడాలని, అహంకారం (ఈగో), ఒత్తిడి (స్ట్రెస్), లేదా మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వంటి దురలవాట్లు కాదని స్పష్టీకరించారు. ‘కల్తీకి ఏదీ అనర్హం కానట్టు’ వ్యవస్థ తయారైందని, చివరకు మనం తినే పళ్ళు కూడా కల్తీ కావడం పట్ల ఆయన విచారం వెలిబుచ్చారు. యువత సంఘటితమై, నడుం బిగించి కల్తీ నిరోధానికి ఉద్యుక్తులు కావాలని బోయపాటి సూచించారు.
సెల్ ఫోన్ చేతులో ఉన్న ప్రతి విద్యార్థి ముంగిట యావత్తు ప్రపంచం ఉంటుందని, ఆ జ్జానాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప, అది ప్రగతికి ప్రతిబంధకంగా మారకూడదని బోయపాటి శ్రీను హెచ్చరించారు. అలాగే అందివస్తున్న అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఏఐ) రెండువైపులా పదునున్న కత్తి వంటిదని, దాన్ని మన పురోగతికే జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ఎంతవరకు వాడాలనే దానిపై ప్రతి విద్యార్థికీ ఓ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.
గీతం, హైదరాబాదు ప్రాంగణానికి, తనకూ అనుబంధం ఇప్పటిది కాదని, అఖండ-1 చిత్రంలోని ఓ పాటను ఇక్కడే చిత్రీకరించామని, అప్పటినుంచి ఈ ప్రాంగణం తనదిగా మారిపోయిందని బోయపాటి చెప్పారు. ఇదే సమయానికి మరో కార్యక్రమం ఉన్నా, కేవలం గీతంతో ఉన్న అనుబంధమే ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసిందన్నారు. మున్ముందు ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా, వీలునుబట్టి తప్పనిసరిగా పాల్గొంటానని ఆయన హమీ ఇచ్చారు. ఇక ఆయనను వేదికపైకి ఆహ్వానిస్తూ, విద్యార్థి సంధానకర్తలు చేసిన సంభాషణపై వివరణ ఇస్తూ, గాలిలో సుమోలు లేచినా, నిజమైన యుద్ధ ట్యాంకు పైనుంచి హీరో దిగినా, ఆయా పాత్రలు, సన్నివేశాలు, సందర్భం, నేపథ్యానికి తగ్గ భావోద్రేకాలను (ఎమోషన్స్) చూపడానికేనని బోయపాటి స్పష్టీకరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, ప్రముఖ నేపథ్య గాయని గీతామాధురి పాటల కచేరీ, ది డెక్కన్ ప్రాజెక్ట్, ది హెడ్ లైనర్ బ్యాండ్, DJ NANDZY యొక్క హై-ఎనర్జీ డీజే సెట్ వంటివి విద్యార్థులను అలరిస్తున్నాయి.
27 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇఫ్తార్ విందు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని వచ్చే…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సైయంట్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పాత్రో మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కృత్రిమ మేధస్సు…
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…