రామచంద్రపురం:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని భారతినగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి పిలుపు నిచ్చారు.
రామచంద్రపురం జిహెచ్ఎంసిి కార్యాలయం లో డిప్యూటీ కమిషనర్ ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతితో పట్టణాన్ని మరింతగా అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగిందన్నారు.కాలనీల వారీగా అధికారులను నియమించామన్నారు..
రేపటి నుండి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించి బస్తిల్లలో,కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం,డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసరాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి కోరారు.
భారతీ నగర్ పరిధిలో ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారురోడ్లు ,డ్రైనేజీ, నాలాలు ఇతర సమస్యలు ఉంటే పట్టణ ప్రగతి కార్యక్రమంలో అప్పటికప్పుడే పరిష్కరిస్తామన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…