పటాన్ చెరు
దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ఊరేగింపు, నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. డీజే పాటలతో, యువకుల నృత్యాలు, కోలాటాల మధ్య గ్రామ వీధుల గుండా దుర్గామాత ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న దుర్గమ్మ తల్లికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులు సర్పంచ్ నీలం మధు కోలాటం ఆడి, నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అందంగా తీర్చిదిద్దిన వాహనంలో డప్పుల చప్పుళ్లు, యువత కేరింతలు, ఆటపాటల మధ్య చిట్కుల్ గ్రామంలోని చెరువుకు తరలించి వైభవంగా అమ్మవారి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్, వార్డు సభ్యులు ‘ఎన్ఎంఎం’ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…