భక్తజన సంద్రంతో, అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్
భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు
భక్త సంద్రంలో ముంచిన భజన గీతాలహరి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
స్వామియే శరణమయ్యప్ప.. హరి హరి వాసనే. శరణమయ్యప్ప అంటూ వేలాదిమంది అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ మార్మోగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు.అభ్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. దేవత మూర్తుల ఉత్సవ విగ్రహాలతో ప్రాంగణం మొత్తం శోభాయమానంగా తీర్చిదిద్దారు. శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వచ్చిన ప్రత్యేక పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్విరామంగా కొనసాగాయి. ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వంగా సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ముందుగా శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం నిర్వహించారు. పదునెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వాముల పెటతుల్లి భక్తులను ఆకట్టుకుంది. అనంతరం పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు.సుమారు 10 వేల మంది భక్తులు కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పట్టభద్రుల శాసన మండలి సభ్యులు అంజి రెడ్డి, దుబ్బాక శాసన సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, గూడెం కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…