_పటాన్చెరువు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి మొదటి పండుగ ఉగాది పర్వదినాన్ని ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించుకోవాలని పటాన్చెరు పట్టణంలోని పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. సోమవారం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. వేద పండితుల సూచనలకు అనుగుణంగా.. మార్చ్ 25న హోలీ పండుగ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 15 నుండి 19 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పర్వదినాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జైపాల్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానా దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…