_పటాన్చెరువు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి మొదటి పండుగ ఉగాది పర్వదినాన్ని ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించుకోవాలని పటాన్చెరు పట్టణంలోని పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. సోమవారం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. వేద పండితుల సూచనలకు అనుగుణంగా.. మార్చ్ 25న హోలీ పండుగ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 15 నుండి 19 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పర్వదినాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జైపాల్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానా దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…