_ప్రచారానికి తరలి వెళ్లిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
మనవార్తలు ,పటాన్ చెరు:
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో 1వ వార్డు, 13వ వార్డు ఇన్చార్జిగా ఎమ్మెల్యే జిఎంఆర్ ను నియమించారు. ఈ మేరకు శుక్రవారం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 25 మంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల బృందంతో కలిసి ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే జిఎంఆర్ బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించడంతో పాటు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చేశారు. అనంతరం మునుగోడు లోని ఒకటో వార్డు, 13వ వార్డులో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం ప్రచారం నిర్వహించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…