తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పర్వదినం అని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని బుధవారం ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రంగోలి, కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పటాన్చెరు కేంద్రంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల ఎం డి ఆర్ ఫౌండేషన్ ను అభినందించారు. తన బాల్యంలో సంక్రాంతి వచ్చిందంటే పండగ ముందు పండగ తర్వాత గాలిపటాలు ఎగురవేస్తూ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే వారమని నేటితరం సెల్ ఫోన్, సోషల్ మీడియా మాయలో పడి మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఎం డి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీరాజ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…