కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయం
మన వార్తలు ,పటాన్ చెరు:
పెన్నార్ పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించిన కార్మికులందరికీ రుణపడి ఉంటామని, కార్మికుల అందరి సహకారంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పటాన్చెరువు శాసనసభ్యులు, గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్కెవి రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి తాను బలపరిచిన అభ్యర్థి రాంబాబు యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాజమాన్యం నుండి న్యాయబద్ధంగా రావలసిన ప్రతి హక్కును సాధిస్తామని, ప్రధానంగా వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సహృద్భావ వాతావరణంలో విధులు నిర్వహించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్మికులందరూ సోదరభావంతో కలిసి మెలసి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, పెన్నార్ పరిశ్రమ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…