బొల్లారం
కోవిద్ వ్యాక్సినేషన్ వంద శాతం విజయవంతం చేయడంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని మున్సిపల్ ఛైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి అన్నారు .సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వందం శాతం పూర్తి చేసిన వైద్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. నిరంతరం వ్యాక్సినేషన్ విజయవంతంకు కృషి చేసిన ప్రైమరీ హెల్త్ సెంటర్ నర్స్ స్వరూప రాణిని , ఆశా వర్కర్లను , అంగన్ వాడీ సిబ్బంది సేవలను మున్సిపల్ ఛైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి కమిషనర్ రాజేంద్ర కుమార్ లు ప్రశంసించారు.వంద శాతం పూర్తయిన సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి విజయ సంకేతాన్ని చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు పట్టణ ప్రముఖులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆర్వోశ్రీధర్,హెచ్ఈఓవెంకటరమణ, వైద్య సిబ్బంది,ఆశా వర్కర్లు ,అంగన్ వాడీ వర్కర్లుపాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…