పటాన్చెరు:
ప్రప్రథమ భారత ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 133 వ జయంతిని పురస్కరించుకుని పటాన్చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి విద్యాభివృద్ధి పట్ల శ్రద్ధ వహించి, వారి వ్యక్తిగత ఎదుగుదలకు సమ ప్రాధాన్యం ఇస్తే ఉపాధ్యాయుడే వారికి ఆదర్శం అని అన్నారు. తమలో పరివర్తన కలిగించిన అధ్యాపకులను ఏ విద్యార్థి అయినా జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు.
మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా అధ్యాపకులు కూడా మారుతూ కొత్త బోధనా పద్ధతులను అలవరచుకోవాలని, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. అన్నింటికీ మించి నాణ్యమైన పరిశోధనలపై దృష్టి సారించి, గీతం లక్ష్యమైన ప్రపంచ మేటి వంద విశ్వవిద్యాలయాలలలో ఒకటిగా నిలవాలన్న ఆకాంక్షకు దోహదపడాలన్నారు.
ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ వినయ్ కుమార్ మిట్టల్, జీఎస్ హెచ్ఎస్ డెరైక్టర్ వీవీవీ నాగేంద్రకుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు, ప్రొఫెసర్ సునీల్ కుమార్, ప్రొఫెసర్ జీఎస్ కుమార్, జీహెచ్ బీఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…