-సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు..
-సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను సన్మానించిన నీలం మధు ముదిరాజ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గురువులు విద్యార్థుల భవిష్యత్తు మార్గదర్శకులని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.టీచర్స్ డే ని పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు గురువులు చేసే సహకారం వెలకట్టలేనిది అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క దశలో గురువులు మార్గదర్శకులుగా ఉంటారని తెలిపారు. బాల్యంలో తల్లిదండ్రులు, పాఠశాలలో టీచర్లు, ఉద్యోగ సమయంలో పై అధికారులు, రాజకీయంలో తమకు నచ్చిన మెచ్చిన నాయకులను గురువుగా భావిస్తారన్నారు. తమ శిష్యులు ప్రయోజకులై జీవితంలో స్థిరపడితే గురువులకు అంతకు మించిన సంతోషం ఉండదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గురువుల మాట తూచా తప్పకుండా పాటిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు, ఆ తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన నీలం మధు ముదిరాజ్, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్,వి నారాయణ రెడ్డి, మాజీ సభ్యులు వెంకటేశ్,మురళీ,రాజ్ కుమార్,కృష్ణశ్రీను,అనిల్,తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…