Telangana

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కి పునాది వేసేది ఉపాధ్యాయులే

– ఫామ్ బీజ్ ప్రైమరి స్కూల్ మూడవ బ్రాంచ్ ప్రారంభo

మన వార్తలు, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫామ్ బీజ్ ప్రైమరీ స్కూల్ మూడవ బ్రాంచ్ ని పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది పాఠశాలలు మాత్రమే అని వాళ్ళ బంగారు భవిష్యత్తు నిర్మాణానికి ఉపాధ్యాయులు పాటుపడాలని అన్నారు. భవిష్యత్తులో ఈ స్కూలు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మహిళలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మాణంలో ప్రైమరీ స్కూల్ లు ఎంతో దోహదపడతాయని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు మొదటి గురువు అయితే, విద్యను బోధించేవారు రెండవ గురువని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అశోక్, వేణు, శ్రీకాంత్ రెడ్డి, కిరణ్, ప్రిన్సిపాల్ షనిలా అడ్రిన్ అకడమిక్ ఇంచార్జి శ్రద్ధ సింగ్, సీనియర్ నాయకులు భాస్కర్ రావు, రోహన్, శైలేందర్ రెడ్డి, కార్యకర్తలు,స్కూలు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

19 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

21 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago