Telangana

శాస్త్రీయ దృక్పథంతో ‘స్పచ్ఛ భారత్’ చేపట్టండి

గీతం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు డబ్బింగ్ కళాకారుడు రాజు పిలుపు

గీతమ్ లో ఘనంగా ‘ఎన్ఎస్ఎస్ డే’

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం. (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు శాస్త్రీయ దృక్పథంతో చేపట్టి, నిబద్ధతతో చురుకుగా పాల్గొనాలని ఐదు నంది అవార్డుల గ్రహీత, ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు ఆర్.సీ.ఎం. రాజు పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని జాతీయ సేవా పథకం మంగళవారం నిర్వహించిన ‘ఎన్ఎఎస్.ఎస్ దినోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, తన కళాశాల రోజులు, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ లో తన అనుభవనాలను గుర్తుచేసుకున్నారు. వాలంటీర్లను సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా ఎన్ఎస్ఎస్ నిలబెడుతుందని చెబుతూ, సమాజ సేవ ప్రాముఖ్యతను వివరించారు. తాను డబ్బింగ్ చెప్పిన కల్కి తంగళన్ వంటి సలు సినిమాలలోని డైలాగ్ లను చెప్పి విద్యార్థులను ఉత్సాహపరిచారు. పునర్వినియోగించ దగ్గ వస్తువులను ఎంచుకోవడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ‘శుభ్రత నాగరికతకు చిహ్నమంటూ, దానిని మనమంతా పాటిద్దామనే ప్రతినబూనాలని రాజు ఉద్బోధించారు.

గీతం ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ అధికారికంగా వేడుకలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మాట్లాడుతూ, ఇతర విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండేలా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మసలుకోవాలని, సశ్చీలత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణం, నిస్వార్థతలు తమ పని విధానంలో ప్రతిబింబించాలని సూచించారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, ఎటువంటి. పరిస్థితులు, ఏ సమయం అనేది చూడకుండా, సమాజ సేవలో ఎల్లవేళలా గీతం ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు. ముందుంటారంటూ, సాధారణ ఎన్నికలలో వెబ్ క్యాస్టింగ్ వంటి కొన్ని సేవా కార్యక్రమాలను ఆయన గుర్తుచేశారు.ఎన్ఎఎస్ ఎస్ గీతాలాపనతో అరంభమైన కార్యక్రమం, కార్యక్రమ సమన్వయకర్త భార్గని వందన సమర్పణతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ముగిసింది. వాలంటీర్లలో సేవా స్ఫూర్తిని, వారి వ్యక్తిగత ఎదుగుదలను పెంపొందిస్తూ ఈ వేడుక విజయవంతమైంది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago