Telangana

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి.. బంగారు భవితకు బాటలు వేసుకోండి

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ తరగతులు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ లక్షల రూపాయలు వెచ్చించి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని, నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణా తరగతులు జరిగే 90 రోజుల పాటు ఏకాగ్రతతో శిక్షణ పొంది, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల్లో అందించే కోచింగ్ ద్వారా పోలీసు శాఖతో పాటు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సైతం ఉపయోగపడుతుందని తెలిపారు. నిరంతరం తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ భీమ్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సిఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, గోపి, సిబ్బంది పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago