మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ తరగతులు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ లక్షల రూపాయలు వెచ్చించి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని, నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణా తరగతులు జరిగే 90 రోజుల పాటు ఏకాగ్రతతో శిక్షణ పొంది, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల్లో అందించే కోచింగ్ ద్వారా పోలీసు శాఖతో పాటు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సైతం ఉపయోగపడుతుందని తెలిపారు. నిరంతరం తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ భీమ్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సిఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, గోపి, సిబ్బంది పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…