మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి మండలలోని మాదాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ రైజింగ్ ఉచిత వేసవి శిక్షణా శిబిరo 2025 పేరుతో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు స్కూల్ ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు తెలిపాడు. ఈ కార్యక్రమంలో యోగా, ధ్యానం, పాటలు, ఆటలు, కర్ర సాము, చిత్రలేఖనం రీడింగ్ బుక్స్, వ్యక్తిత్వ వికాసము, ఆరోగ్యపు అలవాట్లు, చేతి వ్రాత, గణితంలో మెళకువలు, స్వయంగా మాట్లాడడం, నృత్యం,టి ఎల్ ఎం తయారీ, ప్రాజెక్టులు వంటివి పిల్లలకు నేర్పించడం జరుగుతుందనీ తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందనీ. పిల్లలకు స్నాక్స్ అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి మండల విద్యాధికారి వెంకటయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధారాణి, లీలాదేవి, బాలా మణి, లక్ష్మీదేవి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…