మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి మండలలోని మాదాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ రైజింగ్ ఉచిత వేసవి శిక్షణా శిబిరo 2025 పేరుతో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు స్కూల్ ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు తెలిపాడు. ఈ కార్యక్రమంలో యోగా, ధ్యానం, పాటలు, ఆటలు, కర్ర సాము, చిత్రలేఖనం రీడింగ్ బుక్స్, వ్యక్తిత్వ వికాసము, ఆరోగ్యపు అలవాట్లు, చేతి వ్రాత, గణితంలో మెళకువలు, స్వయంగా మాట్లాడడం, నృత్యం,టి ఎల్ ఎం తయారీ, ప్రాజెక్టులు వంటివి పిల్లలకు నేర్పించడం జరుగుతుందనీ తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందనీ. పిల్లలకు స్నాక్స్ అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి మండల విద్యాధికారి వెంకటయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధారాణి, లీలాదేవి, బాలా మణి, లక్ష్మీదేవి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…