Telangana

విద్యార్థులు భావిభారత నిర్దేశకులుగా ఎదగాలి_పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి

– కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులు సత్ప్రవర్తనతో రేపటి భావిభారత నిర్దేశకులుగా ఎదగాలని పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ప్రిన్సిపాల్ నాగరాజుతో కలిసి సీఐ వేణుగోపాల్ రెడ్డి స్కూల్ నూతన క్యాలెండర్ 2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే మంచిని మాత్రమే తెలుసుకొని, చెడు విషయాల జోలికి వెళ్ళవద్దన్నారు. అపరిచిత వ్యక్తులు మెసేజ్ లు ఫార్వర్డ్ చేసి ఓటీపీలు చెప్పమంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దన్నారు. అలా అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పి చాలామంది విద్యార్థులు, యువత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని మోసపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులకు మొదటి స్నేహితులుగా ఉంటూ అన్ని విషయాలను పంచుకోవాలని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని, కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకొని వారి తల్లిదండ్రులకు, గురువులకు, స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలని సీఐ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

14 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

14 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

14 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago