మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ది మాస్టర్ మైండ్స్ స్కూల్ నూతన బ్రాంచ్ ను స్కూల్ చైర్మన్ రాజు సంఘాని, ప్రిన్సిపాల్ నాగరాజు లతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని రకాల నాణ్యమైన విద్యను స్కూల్ యాజమాన్యం అందించాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు చేయడం జరుగుతుందని, వారి నమ్మకాన్ని విద్యార్థులు నెరవేర్చాలని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు ముఖ్యంగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో వారికి సంబంధించిన వాటినే తీసుకొని, మిగతా వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల పోటీ పరీక్షలలో విద్యార్థులు రాణించాలని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకొని స్కూల్ కు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తూ, క్రమశిక్షణకు మారుపేరుగా ది మాస్టర్ మైండ్స్ స్కూల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మున్సిపల్ చైర్ పర్సన్ ప్రమీల, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, శివకుమార్ గౌడ్, హర్షరెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, నిజాంబాద్ శ్రీనివాస్, ది మాస్టర్ మైండ్స్ స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సన్ వే ఓపస్, ప్రైడ్ పార్కు కాలనీలో 5 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి నరేందర్…
సీఎం రేవంత్ రెడ్డి సిగాచీ బాధితులకు ఇచ్చిన కోటి రూపాయలు హామీ నెరవేర్చరా..?? పాశమైలారం పారిశ్రామిక వాడలోని బిపిఎల్ చౌరస్త…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన ఘోర…
గౌరవ సలహాదారుగా చుక్కా రాములు గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి అధ్యక్షులుగా ఉపేందర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు…